కూకట్పల్లి తెదేపా అభ్యర్థి నందమూరి సుహాసిని కేంద్ర ఎన్నికల సంఘానికి మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు, కూకట్పల్లి ఏసీపీ సురేంద్ర ఫై పిర్యాదు చేసారు. కూకట్పల్లి తెరాస అభ్యర్థి మాధవరం కృష్ణారావుకు పోలీసులు సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ ఇద్దరు అధికారులను బదిలీ చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లి నియోజకవర్గం పరిధిలోని అల్లాపూర్, ఓల్డ్ బోయిన్పల్లి ప్రాంతాల్లో అదనపు బలగాలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సుహాసిని ఎన్నికల సంఘాన్ని కోరారు.