YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కరువు కనిపించడం లేదా

కరువు కనిపించడం లేదా

అనంతపురం జిల్లాలో కరువు తాండవం చేస్తున్నా ప్రతిపక్ష నేత జగన్‌‌‌కు పట్దదా అంటూ ప్రశ్నించారు జనసేన అధినేత పవన్. బాధ్యాతాయుతమైన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వెళ్లరు.. ప్రజా సమస్యలు, కరువు గురించి ప్రభుత్వాన్ని నిలదీయరా అంటూ మండిపడ్డారు. ప్రతిపక్షానికి ప్రజలపై ప్రేముంటే అసెంబ్లీలో అనంతపురం కరవు, వలసల గురించి మాట్లాడాలన్నారు. ప్రభుత్వం, ప్రతిపక్షం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకొని తిట్టుకుంటే ఉపయోగం లేదన్నారు. అనంతపురం జిల్లా పర్యటనలో ఉన్న జనసేనాని.. గురువారం కరువు, నిరుద్యోగం, వలసల సమస్యలపై మీడియాతో మాట్లాడారు. రాజకీయాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జగన్ గుర్తించనంత మాత్రాన జనసేనకు గుర్తింపు లేనట్టా అని ప్రశ్నించారు పవన్. ఒక్క పిలుపుతో లక్షల మంది కవాతులో పాల్గొన్నారని గుర్తు చేశారు. అయినా జనసేన పార్టీకి వైసీపీ గుర్తింపు అవసరం లేదన్నారు. ప్రజల ఆకాంక్షల ప్రకారం రాజకీయ వ్యవస్థ నడవట్లేదని జనసేనాని అన్నారు. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల ప్రజల్ని నేతలు ఓటు బ్యాంకుగా పరిగణించినంత కాలం అభివృద్ధి ఎప్పటికీ జరగదని వ్యాఖ్యానించారు. ఏపీలో పోటీ చేయాలని అన్ని జిల్లాల నుంచి అడుగుతున్నారని.. తాను ఎక్కడి నుంచి పోటీ చేసేది ఫిబ్రవరిలోగా క్లారిటీ ఇస్తానన్నారు. నేటి రాజకీయాల్లో స్వార్థం పెరిగిపోయిందంటున్నారు జనసేన అధినేత. నేతలంతా వారి అవసరాలకు తప్ప ప్రజల కోసం పార్టీలను నడపటం లేదన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు రాజకీయ వ్యవస్థ లేదని.. మార్పు రావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సమస్యలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నా.. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వెళ్లరని మండిపడ్డారు. రాయల సీమకు చెందిన ప్రతిపక్ష నేత జగన్.. అనంతపురం జిల్లాలో కరువు సమస్యపై ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయరో చెప్పాలన్నారు. అనంతపురం జిల్లాలో ఎన్నో సమస్యలు తన దృష్టికి వచ్చాయన్నారు జనసేనాని. రైతులు, చేనేతలు కష్టాల్లో ఉన్నారని.. ఉపాధిలేక రాయలసీమ యువత వలసపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు నిర్మూలన కోసం శాశ్వత పరిష్కారం చూపే ప్రణాళికలు అవసరమన్నారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా నమోదయ్యిందన్నారు పవన్. గతంలో ప్రభుత్వం రూ.కోట్లు ఖర్చు పెట్టి రెయిన్‌ గన్స్‌ ఏర్పాటు చేసినా.. రైతులకు ఉపయోగపడ లేదన్నారు. నీళ్లు లేక కనీసం ఒక ఎకరం కూడా తడవలేదని రైతులే తనతో చెప్పారని.. రెయిన్‌ గన్ల వల్ల ఎంతో మందికి కమీషన్లు మాత్రం దక్కాయని విమర్శించారు. రైతులంతా సంతోషంగా ఉన్నారని ప్రభుత్వం అందర్ని నమ్మించిందని మండిపడ్డారు. రైతులందరికీ జనసేన అండగా ఉంటుందన్నారు.

Related Posts