తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని చింతమడక గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా హైదరాబాద్లో సైతం ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పారు.