ఈ రోజు ఉదయం మోత్కుపల్లి నర్సిహులుకు తీవ్ర అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో ఆయన్ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆయన సుప్రజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. లోబీపీతో పాటు ఛాతీలో విపరీతమైన నొప్పి, వాంతులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో మోత్కుపల్లి అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.