YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం….ముగ్గురి మృతి

ఓ ఆర్ ఆర్ పై రోడ్డు ప్రమాదం….ముగ్గురి మృతి
రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని రావిరాల ఓ ఆర్ ఆర్  పై  ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు.  మరొక నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. శంషాబాద్ నుండి బొంగులుర్ వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి  ఏలూరు నుండి ఒక రోగిని  హైదరాబాద్ హాస్పిటల్ కు  తీసుకుని వస్తున్న అంబులెన్స్ ని ఢీ కొట్టింది. అటుగా వెళుతున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి అధికారులకు సమాచారాన్ని అందజేశారు మృత దేహాలను ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతులు కర్ణాటకలోని బళ్లారి ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. కారు డ్రైవర్ నిద్రమత్తుతో నడపడం వల్ల ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Related Posts