YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్టీ వీడను..ఆళ్లగడ్డ నుంచే పోటీ

పార్టీ వీడను..ఆళ్లగడ్డ నుంచే పోటీ
ఆళ్లగడ్డ కార్డన్ సెర్చ్, గన్‌మెన్ల వివాదంపై ఏపీ మంత్రి అఖిలప్రియ ఎట్టకేలకు స్పందించారు. పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని క్లారిటీ ఇచ్చారు. గన్‌మెన్ల వివాదాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని మంత్రి చెప్పారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన అఖిలప్రియ గన్‌మెన్ల వివాదంతో పాటూ పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారంపై స్పందించారు. టీడీపీని వీడే ప్రసక్తేలేదంటున్నారు అఖిలప్రియ. కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తనకు పార్టీలో ఎవరితో విభేదాలు లేవని.. జనసేనలోకి వెళతానంటూ జరుగుతున్న ప్రచారాన్ని కూడా నమ్మొద్దన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆళ్లగడ్డకు నీళ్లు వచ్చాయి.. ఆళ్లగడ్డ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించారని గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని.. మళ్లీ గెలిచి చంద్రబాబుకు కానుకగా ఇస్తానన్నారు. సీఎం కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని కితాబిచ్చారు. తన తల్లిదండ్రులు చూపిన బాటలోనే నడిస్తానని తెలిపారు.  అర్ధరాత్రి తర్వాత ఆళ్లగడ్డలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసులు మంత్రి అఖిలప్రియ అనుచరుల ఇళ్లల్లోనూ సోదాలు జరిపారు. ఈ వ్యవహారాన్ని కార్యకర్తలు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. తమను పోలీసులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో అఖిల స్థానికులు పోలీసుల్ని వివరణ కోరగా.. ఎస్పీ ఆదేశాలతో తనిఖీలు నిర్వహించారని చెప్పారు. అనుమానం ఉన్నవారి ఇళ్లలోనే సోదాలు చేశామన్నారు.పోలీసుల తీరును నిరసిస్తూ మంత్రి అఖిల ప్రియ గన్‌మెన్‌లను వెనక్కు పంపారు. తనకు సెక్యూరిటీ అవసరం లేదని తిరస్కరించారు. తనకు రక్షణగా వస్తున్న స్థానిక పోలీసుల్ని కూడా వెంట రావద్దన్నారు. ఎలాంటి భద్రత లేకుండానే నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. గ్రామ దర్శిని, జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. గత ఐదు రోజులుగా మంత్రికి ఎలాంటి సెక్యూరిటీ లేదు

Related Posts