కామారెడ్డి జిల్లా లోని బాన్సువాడ డివిజన్ కేంద్రంలో గల కల్కి చెరువు పనులను మాజీమంత్రి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి శుక్రవారం ఉదయం తెరాస నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ చెరువును మినీ ట్యాంక్ బండ్ గా మార్పు కోసం మార్చడం కోసం ప్రత్యేక నిధులను కేటాయించామనీ వెల్లడించారు. ఇందులో భాగంగానే ఈ చెరువును పరిశీలించామని,, త్వరగా పనులు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎమ్మెల్యే వివరించారు . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తో పాటు స్థానిక తెరాస పార్టీ నాయకులు పాల్గొన్నారు.