బస్సుకు, ఆటోకు, మెట్రోకు ఒకే టికెట్ అందుబాటులోకి రానున్నది. అన్నింటిలో ప్రయాణించడానికి వీలుగా మెట్రో మొబిలిటీ కార్డులు రూ.1,000, 2,000లో లభించనున్నాయి. వీటిని సులభంగా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ కార్డులు అన్ని మెట్రో రైలు, నగర రైల్వే స్టేషన్లతోపాటు, బస్స్టేషన్లు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనూ అందుబాటులో ఉంటాయి. తొలుత 2 మెట్రోస్టేషన్లు, 100 ఆర్టీసీ బస్సులు, 50 ఆటోల్లో వీటిని ఈ నెల చివరి నాటికి పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి తీసుకురానున్నారు.మెట్రో, ఎంఎంటీఎస్ ప్రయాణానికి కౌంటర్ల వద్ద టికెట్ కోసం క్యూలో నిల్చోవల్సి వస్తుంది. అయితే ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటంతోపాటు మెరుగైన ప్రజారవాణా వ్యవస్థను తయారు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను తయారు చేశారు. మెట్రోరైలులో ప్రస్తుతం అమలు చేస్తున్న సాఫ్ట్వేర్తోపాటు స్మార్ట్కార్డు విధా నంలోనే కొత్త కార్డు తయారీ , వినియోగం ఉండనుంది. కార్డులు అన్ని మెట్రోరైలు, నగర రైల్వేస్టేషన్లతోపాటు, బస్స్టేషన్లు, ఎస్బీఐ బ్యాంకులలో అందుబాటులో ఉంటాయి. వారం రోజుల్లో వీటి రూపకల్పన చేసే బాధ్యతను ప్రభుత్వం ఆర్టీసీ ఐటీ ఈడీ పురుషోత్తం నాయక్కు బాధ్యతలు అప్పగించింది. మెట్రో నడిచే మార్గాల్లో ముందుగా 2 మెట్రో స్టేషన్లు, 100 ఆర్టీసీ బస్సులు, 50 ఆటోల్లో వీటిని ఈ నెల చివరినాటికి పైలట్ ప్రాజెక్టుగా అందుబాటులోకి మొబిలిటీ కార్డును అందుబాటులోకి తెస్తారు. మెట్రో మొబిలిటీ కార్డు అందు బాటు లోకి రానుంది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టి విజయవంతమైతే దశలవారీగా విస్తరించే అవకాశముంది. నగర ప్రయాణికులకు సులభతరమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నగర రవాణా విభాగాలు సంయుక్తంగా ముందడుగు వేసాయి. ట్రాఫిక్ రద్దీతో సతమతమయ్యే నగర ప్రజలకు రైలు, రోడ్డు రవాణా సదుపాయాల్లో ఏది అందుబాటులో ఉంటే దానిలో సులువుగా ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగర జీవనంలో సమయం సద్వినియోగం చేసుకునేలా ప్రయాణికులకు కామన్ ట్రావెల్ టికెట్ కార్డును ప్రభుత్వం అందుబాటులోకి తెస్తున్నది. మెట్రో మొబిలిటీ కార్డు పేరుతో ఇప్పటికే సిద్ధమైన ఈ కార్డు ప్రయాణికుడి వద్ద ఉంటే హైదరాబాద్ నగర ముఖచిత్రాన్నే సమూలంగా మార్చేసిన మెట్రోరైలుతోపాటు జంటనగరాల్లో ప్రయాణికులను చేరవేసే ఎంఎంటీఎస్, సిటీఆర్టీసీ బస్సులు, ఆటోలు, ట్యాక్సీలలో టికెట్ లేకుండా ప్రయాణించవచ్చు. ఐతే ఈ కార్డు ప్రారంభం రూ.1,000, 2,000లలో లభించనున్నాయి. ప్రయాణం చేయడం ద్వారా కార్డులో ఉన్న మొత్తం ఖర్చ యితే సులభంగా రీచార్జ్ చేసుకునేలా ఈ కార్డు ఉంటుంది. కార్డు ఉంటే చాలు వీటిలో ఏ ప్రయాణ సౌకర్యాన్నైనా వినియోగించుకునే వీలుకల్పించారు. ప్రస్తుతమున్న విధానం ప్రకారం మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ, ట్యాక్సీ, ఆటో ఏది ఎక్కి ప్రయాణించినా సం బంధిత సంస్థ లేదా వ్యక్తికి ప్రయాణ చార్జీలు చెల్లించాల్సిందే. . ఇప్పటికే నగరంలో వాహనాలు అరకోటి దాటడం వాహన కాలుష్యం తగ్గించడానికి ఈ నిర్ణయం ఎంతో దోహదం చేస్తున్నది. హైటెక్సిటీ మార్గంలో కమర్షియల్ ఆపరేషన్స్ ప్రారంభించిన రోజే మొబిలిటీ కార్డును ఆవిష్కరించే అవకాశముందని తెలిసింది.