YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు

హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతి చెందిన తెలంగాణ విద్యార్థుల మృతదేహాలు శంషాబాద్ చేరుకున్నాయి. కాసేపట్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించడానికి వెళ్లిన  సాత్వికా శరణ్, అరుణ్ సుహాస్ నాయక్, సుచరితా నాయక్ అగ్నిప్రమాదంలో చిక్కుకుని మరణించారు. క్రిస్మస్ పండుగ రోజు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో అర్ధరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలకు సజీవదహనమయ్యారు. అమెరికాలోని కొలిర్ విలిలో ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంలో చిక్కుకుని మొత్తం నలుగురు మృతి చెందారు. ఇందులో ముగ్గురు నల్గొండ జిల్లాకు చెందిన టీనేజ్ విద్యార్థులు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తోబుట్టువులు. మృతులు సాత్విక నాయక్, సుహాస్ నాయక్, జయ్సుచిత లు.  వీరంతా ముగ్గురు నల్గొండ జిల్లా ఆడిశర్లపల్లి మండలం గుర్రపుతండాకు చెందినవారు.

ఈ ముగ్గురు ఏడాది క్రితం చదువుకునేందుకు అమెరికా వెళ్లారు. తల్లిదండ్రులు క్రిస్మస్ వేడుకలకు భారత్ వచ్చారు. దీంతో సాత్విక, సుహాస్, జయ్ ముగ్గురూ కొలిర్విలీలోని చర్చిలో ప్రార్థనలు చేశారు. ఆ తరువాత తమ కుటుంబ స్నేహితులైన క్యారిక్రూడిట్ ఇంటికి వెళ్లారు. క్యారిక్రూడిట్ ఇంట్లో ఉన్న సమయంలోనే మంటలు చెలరేగాయి. 

Related Posts