కాంగ్రెస్ పార్టీ లో కష్టపడేవారిని గుర్తించాలి. కష్టపడేవారిని గుర్తించాల్సిన అవసరం రాహుల్ గాంధీ కి ఉంది. లేకుంటే భవిష్యత్ అంధకారమేనని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లో లాబీయింగ్ సిస్టం కు స్వస్తి పలకాలి. ఢిల్లీ లో తిరిగే వాల్లకే ప్రాధాన్యత ఇస్తున్నారు ఇది సరైంది కాదని అయన అన్నారు. తెలంగాణ లో పార్టీ కోసం కష్టపడేవారికి గుర్తింపు లేదు. కులాలకు ,మతాలకు సంబంధం లేకుండా సమర్దుడిని కి భాధ్యతలు అప్పజెప్పాలి. ప్రజలు ఏవరిని కోరుకుంటారో వారికి ప్రాధాన్యత ఇవ్వాలి. లాబీయింగ్ ద్వారా సీఏల్పీ ఏంపిక జరిగిదే పార్టీ పరిస్థితి ఇక అంతేనని అయన అన్నారు. రహస్య సర్వే ద్వారా చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని సీఏల్పీ ఏంపిక చేయాలి. తెలంగాణ లో ప్రజాధారణ కలిగిన నాయకుడు ఏవరనేది రాహుల్ గాంధీ గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు.