YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అభివృద్దికి చిరునామా బీజేపీ

అభివృద్దికి చిరునామా బీజేపీ

దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి రోజు కడప రావడం సంతోషంగా ఉంది. ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రం చేసిన సీమ లో ఈరోజు పాల్గొనడం శుభ పరిణామం. కేంద్ర బీజేపీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పథకాలపై ప్రజల్లోకి తీసుకుని పోయేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ నేత దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. కడప లో జరిగిన బీజేపీ రాయలసీమ నియోజకవర్గాల ఇంచార్జిల సమావేశంలో ఆమె పాల్గోన్నారు.  మోడీ,అమిత్ షా నిర్దేశించిన మార్గాల్లో 2019లో బీజేపీ విజయానికి కృషి చేయాలి. ఎందరో మహానుభావుల ఆదర్శంగా తీసుకుని బీజేపీ విజయానికి తోడ్పడాలి. బీజేపీ అంటే అభివృద్ధి కి చిరునామా.. ఏపీ అభివృద్ధికి అంకితం అయ్యింది. ఐదు ఏళ్లలో  ఒక రాజధాని కట్టలేని రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉండటం  దారుణం. చంద్రబాబు చేసిన అవినీతి ని ప్రజలు గుర్తించి తగిన గుణపాఠం చెప్పాలని అన్నారు. నిరుద్యోగులకు 2500  భృతి అని ఎన్నికల వేల 1000 ఇస్తూ మభ్య పెడుతున్నారు. లక్షల మంది నిరుద్యోగ యువత ఉంటే కేవలం10 లక్షల మంది కి ఇవ్వడం సమంజసమేనా అని అడగారు. బీజేపీపట్ల  ప్రజల్లో సానూకులత వుండేది, బీజేపీ ని ప్రజలు ఆమోదిస్తున్నారు అనేది వాస్తవమని అన్నారు. 

Related Posts