చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ నెల 25 వతేదీ లోపు నమోదు చేసుకున్న ఓటర్సు అభిప్రాయాలను నివృతి చేసుకోవడానికకి టోల్ ఫ్రీ నెం 1950 కి ఫోన్ చేయాలని ఇన్ ఛార్జీ కలెక్టర్ యస్.నాగలక్ష్మి సూచించారు. శుక్రవారం ఉదయం ప్రకారం భవనం, కలెక్టరేట్ లో ఎన్ ఐ సి హాలులో భారత ఎన్నికల సంఘం ఢిల్లీ నుండి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో అన్ని రాష్ట్రాలతో పాటు జిల్లాలలోని ఓటర్లుగా నమోదు చేసుకున్నవారు, ఓటరుగా నమోదై వుండి మార్పూలు, చేర్పూలు, చేసుకొనేవారు, ఏవైనా ఓటు హక్కు గురించి అనుమానాలను నివృత్తి చేసుకోవాలనే దానిపై టోల్ ఫ్రీ నెం.1950 ను సంప్రదించాలని సూచించారు. ప్రజలందరు అప్రమత్తంగా ఉండి నమోదు చేయించుకున్న ఓటర్లు ఎలాంటి అనుమానాలు ఉన్న సంబంధిత ఎన్నికల నిర్వహణ అధికారి దృష్టికి తేవాలని భారత ఎన్నికల సంఘం సూచించడం జరిగింది. భారత ఎన్నికల సంఘం అర్హులైన ఓటర్లు ఒటుహక్కు కల్పించే విధంగా అధికారులు సమన్వమంతో వ్యవహరించాలని ఓటరుగా నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు ప్రక్కవారికి తెలియజేసి పూర్తి స్తాయిలో జాబితాలో పేరు ఉండేటట్లు చూసుకోవాలని కోరారు. త్వరలో సాధారణ ఎన్నికలు రానున్న సందర్భంగా ఓటర్లు అప్రమతంగా ఉండి తమ కుటేండ సహ్యులందరికి పేర్లు నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం కోరాడం జరిగింది. ఓటు నా హక్కు అనే భావం ప్రతి ఒక్క ఓటరులో కలగాలని, ప్రక్కవారికి చెప్పి ఓటు విలువ గొప్పది. అనే భావన వారిలో కలిగించాలని కోరారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.వెంకటసుబ్బయ్య, స్పెషల్ డిప్యూటి కలెక్టర్ కొండయ్య, డి.ఆర్.డి.ప్రాజెక్టు అధికారి నరసిహులు, కందుకూరు, రెవిన్యూ డివిజనల్ అధికారి కె.రామారావు, కె.కృష్ణవేణి, తదితర అధికారులు పాల్గొన్నారు.