YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ పై అనవసర కామెంట్స్

జగన్ పై అనవసర కామెంట్స్
అమరావతితో వైఎస్ జగన్ కట్టుకుంటున్న ఇంటిపై గగ్గోలు పెట్టేందుకు ఎల్లో మీడియా సిద్ధమైపోయిందని అన్నారు వైసీపీ రాజ్యసభ విజయసాయిరెడ్డి. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్.. జనంతో ఉండాలన్న ఉద్దేశంలో రాజధానిలో ఇల్లు కట్టుకుంటున్నారని తెలిపారు. సీఎంగా ఉన్న చంద్రబాబు ఇప్పటివరకు అమరావతిలో ఇల్లు ఎందుకు కట్టుకోలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అడ్డంగా సంపాదించిన డబ్బుతో హైదరాబాద్‌లో కట్టుకున్న ఇంద్ర భవనం గురించి ఎల్లో మీడియా పట్టించుకోదని ఆయన ట్వీట్ చేశారు. జగన్‌పై దాడి కేసు విచారణను ఎన్ఐఏ స్వీకరించినప్పటి నుంచి చంద్రబాబుకు గుండెల్లో రైళ్లు పరుగు పెడుతున్నాయని విజయసాయి రెడ్డి అన్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రాని పాలించలేకపోతున్న చంద్రబాబు.. తాను స్వతంత్ర రాజ్యానికి చక్రవర్తిలా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు బాబును సాగనంపేందుకు పోలింగ్ తేదీ కోసం ఎదురుచూస్తున్నారని విజయసాయి అన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ తన మకాంను అమరావతికి మారుస్తున్న సంగతి తెలిసిందే. అమరావతిలో వైసీపీ కార్యాలయం, జగన్ నివాసం నిర్మాణం పూర్తి కావొస్తోంది. ఫిబ్రవరి 14న జగన్ కొత్త ఇంటిలోకి వెళ్లనున్నారని, ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకానున్నారని వార్తలు వస్తున్నాయి. 

Related Posts