YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

దుమారం రేపుతున్న టీడీపీ ప్లకార్డు

దుమారం రేపుతున్న టీడీపీ  ప్లకార్డు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఢిల్లీ వేదికగా ధర్మపోరాటానికి దిగారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలంటూ దీక్ష చేపట్టారు. అయితే ఈ నిరసన కార్యక్రమంలో ప్రధాని మోదీని టార్గెట్ చేస్తూ టీడీపీ ఏర్పాటు చేసిన పోస్టర్‌పై దుమారం రేగింది. దీక్షా వేదిక పక్కన నంది విగ్రహం ఎదురుగా చాయ్ కప్పును ఉంచి.. ప్లకార్డుపై ఎవరి చేతికైతే తాగేసిన టీ కప్పు ఇవ్వాలో.. వారి చేతికి ప్రజలు దేశాన్ని అప్పగించారు  అంటూ విమర్శించారు. ఈ పోస్టర్‌‌పై బీజేపీ మండిపడుతోంది. నరేంద్ర మోదీని టీడీపీ నేతలు అవమానించారంటూ ఎదురు దాడికి దిగింది. దేశ ప్రధాని పదవిలో ఉన్న వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదా.. టీడీపీ దిగజారుడు రాజకీయాలకు ఇది నిదర్శనమంటూ అంటూ నిప్పులు చెరిగారు ఆ పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై వివాదం చెలరేగడంతో.. టీడీపీ నేతలు ఆ పోస్టర్‌ను అక్కడి నుంచి తొలగించారు. పోస్టర్‌ను అక్కడి నుంచి తొలగించినా సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్‌గా మారింది. 

Related Posts