యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్ కు స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించింది.10 లక్షల జనాభా కలిగిన మెట్రోపాలిటన్ సిటీలలో కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే ఈ పురస్కారం. దక్కింది. ఇటీవలే నగరానికి స్వచ్ఛ భారత్ మిషన్ ఓ డి ఎఫ్ ప్లస్ ప్లస్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ రూ. 10లక్షల నగదు నజరానా తో పాటుస్వచ్ఛ భారత్ మిషన్లో భాగంగా నగరంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను కల్పించడానికి గుర్తింపుగా ఈ అవార్డు. హైదరాబాద్ నగరానికి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు దక్కడం పట్ల నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్లు హర్షం వ్యక్తం చేసారు.స్వచ్ఛ హైదరాబాద్ కు చేస్తున్న కృషికి గుర్తింపుగాఈ స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు లభించింది... మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు. పది రోజుల వ్యవధిలోనే హైదరాబాద్ నగరానికి రెండు గుర్తింపులు లభించడం పట్ల జిహెచ్ఎంసి కమిషనర్ దానకిషోర్ సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షన్ 2019 లోను మంచి ర్యాంకింగ్ సాధిస్తాం మన్నారు.