YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు,  వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారిక యంత్రాంగానికి  జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ మండలాల నుంచి 69 విజ్ణప్తులు వచ్చినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి పరిష్కరించే దిశగా కృషి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, డీఆర్వో చంద్రశేఖర్, డీపీఓ సురేష్ బాబు, డీఎంహెచ్ ఓ అమర్ సింగ్, డీడబ్ల్యూఓ జరీనా బేగం, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 
- వికలాంగుడికి మూడు చక్రాల సైకిల్ అందజేత 
సిద్ధిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన బాల్యం నుంచే అంగవైకల్యం ఉండటంతో ల్యాగల రాంప్రసాద్ కు సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో ప్రజావాణిలో అర్జీ పెట్టుకున్నారు. ఈ మేరకు వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ డీడబ్ల్యూఓ జరీనా బేగంకు  సూచనలు చేసి అప్పటికప్పుడే మూడు చక్రాల సైకిల్ మంజూరు చేసి ఆయన చేతుల మీదుగా ట్రై సైకిల్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. 

Related Posts