YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఐక్యరాజ్య సమితి సమ్మిట్లో ప్రసంగించనున్న ఎంపి కవిత

ఐక్యరాజ్య సమితి సమ్మిట్లో ప్రసంగించనున్న ఎంపి కవిత

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో: 

నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవితకు మరో అరుదైన గౌరవం లభించింది. యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక సంస్థ, గ్లోబల్ నెట్ వర్క్ ఇండియా మార్చి 1వ తేదీన న్యూడిల్లీలో నిర్వహిస్తున్న లింగ సమానత్వ సదస్సు లో ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది. ఎంపి కవిత ఆలోచనలు, లింగ సమానత్వం కోసం చేస్తున్న ప్రయత్నాలు, ఎస్డిజి లక్ష్యాల సాధన కోసం చేస్తున్న ప్రయత్నాలను గుర్తించి సమ్మిట్కు ఆమెను ఎంపిక చేశారు.  సమ్మిట్ నాలెడ్జ్ భాగస్వామి డెలాయిట్ తో కలిసి 4 వ పారిశ్రామిక విప్లవం కోసం మహిళలను సిద్ధం చేయడం, భారతదేశంలో లింగ సమానత్వం అవార్డులను ప్రధానం చేసే పద్ధతులపైనా చర్చిస్తారు. ప్రభుత్వ అధికారులు, అకాడమీలు, పౌర సమాజ, స్వచ్చంధ సంస్థలు ఈ సదస్సులో  బ్లూప్రింట్ ను రూపొందిస్తారు. 
ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కాంపాక్ట్ స్థానిక ఆర్క్, గ్లోబల్ కాంపాక్ట్ నెట్వర్క్ ఇండియా (జిసిఎన్ఐ) మన దేశ వ్యాపారాలు, విద్యాసంస్థలు,  పౌర సమాజ సంస్థలకు బాధ్యతాయుతమైన వ్యాపార విధానాలతో వాటిని బలోపేతం చేయడానికి కలసికట్టుగా పనిచేసే  ఒక వేదికగా  వ్యవహరిస్తోంది. 2015లో రూపొందించబడిన మానవ హక్కులు, కార్మికులు, పర్యావరణం మరియు అవినీతి రహిత సమాజం నిర్మాణం వంటి  లక్ష్యాల కోసం ఐక్య రాజ్య సమితి సభ్య దేశాలు యత్నిస్తాయి. 193 సభ్య దేశాల్లో తీవ్ర పేదరికం, అసమానత మరియు అన్యాయాన్ని ఎదుర్కోవటానికి భారతదేశంతో సహా ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలు కలిసి పని చేస్తున్న విషయం తెలిసిందే. 
నాల్గవ పారిశ్రామిక విప్లవం వ్యాపార, సాంకేతికత, ఆటోమేషన్, పెద్ద డేటా మరియు పెరిగిన మానవ-డిజిటల్ ఇంటర్ఫేస్ యొక్క పాత్ర పెరిగింది. దీని వల్ల మన దేశంలోనూ యువత ఆయా రంగాల్లో తగిన నైపుణ్యాన్నిపెంపొందించుకోవడం తప్పని సరి అయింది.                     
అలాగే ఉపాధి పరంగా, నైపుణ్యం సముపార్జన లోనూ అవకాశాలు తక్కువగా ఉండే మహిళలు ఆయా రంగాల్లో పురోగమించేందుకు అవసరమైన నైపుణ్యాలు, సాంకేతికంగా పట్టుసాధించడం, పని ప్రదేశాల్లో అటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, విద్యావిధాన మార్పులు వంటి అంశాలపైనా సమ్మిట్లో కూలంకంశంగా చర్చిస్తారు.

Related Posts