యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా ఎర్రబెల్లి దయాకర్రావు శుక్రవారం ఉదయం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రి ఎర్రబెల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాకు పెద్ద బాధ్యత అప్పజెప్పారని, నా 35ఏళ్ల రాజకీయ జీవితంలో 25 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేశానని, ఇంత ఆనందం ఎప్పుడూ కలగలేదన్నారు. కొత్త పంచాయితీ రాజ్ చట్టంలో గ్రామీణ రూపురేఖలు మారుతాయని మంత్రి అన్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేైళ్లెనా గ్రామాలు ఇంకా ఆధ్వాన్వంగా ఉన్నాయన్నారు. సీఎం తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో గ్రామాల రూపురేఖలు మారతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ తనకు పెద్ద బాధ్యతను అప్పగించారన్నారు. రైతులు బాగుపడాలి, పంచాయతీలు అందంగా కనిపించాలన్నారు.