YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

సైరాపై ఆశలతో మెగా ఫ్యామిలీ

సైరాపై ఆశలతో మెగా ఫ్యామిలీ

యువ్ న్యూస్ ఫిలిం బ్యూరో:

తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సినిమాల్లో ‘సైరా నరసింహారెడ్డి’ ఒకటి. రాయలసీమకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్, తమిళ నటుడు విజయ్ సేతుపతితో పాటు జగపతిబాబు, నయనతార, తమన్నా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా భాగం కానున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తోంది. తెరపై కాకుండా తెర వెనకనుంచి ‘సైరా’లో అల్లు అర్జున్ మెప్పించబోతున్నారట. అంటే, సైరాలోని కొన్ని సన్నివేశాలకు అల్లువారబ్బాయి వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారని అంటున్నారు. అలాగే, సినిమాలోని ప్రతి పాత్రను అల్లు అర్జునే తన గొంతుతో పరిచయం చేస్తారట. ఈ వార్తలో నిజమెంతో తెలియదు కానీ, మెగా అభిమానులకు మాత్రం ఇది మంచి కిక్ ఇచ్చే వార్త. అయితే, అల్లు అర్జున్ ‘సైరా’కు వాయిస్ ఓవర్ ఇవ్వడంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ‘సైరా నరసింహారెడ్డి’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇప్పటికే రామ్ చరణ్ చెప్పారు. ఇటీవల ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. ‘ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమా ద్వారా లాభాలు వస్తే అది మాకు బోనస్ అనుకుంటాం. ఒకవేళ లాభం రాకపోయినా అదీ మాకు ఆనందమే. బడ్జెట్ విషయంలో వెనకడుగు వేయడంలేదు’ అని రామ్ చరణ్ చెప్పారు. అంటే, ఈ సినిమా విషయంలో చరణ్ ఎంత నిబద్ధతతో ఉన్నారో అర్థమవుతోంది. ప్రస్తుతానికి ఈ చిత్ర బడ్జెట్ రూ.200 కోట్లని అంటున్నారు. ఇంకా పెరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరంలేదు. 

Related Posts