YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉమ్మడి ఖమ్మంలో టీడీపీ ఖాళీ

ఉమ్మడి ఖమ్మంలో టీడీపీ ఖాళీ
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఉమ్మడి  ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం పార్టీ దుకాణం దాదాపుగా ఖాళీ అయింది. అందలం ఎక్కిన చోటే అధఃపాతాళానికి దిగజారింది. మారిన రాజకీయ సమీకరణాలు, తెలంగాణ ఏర్పాటు వంటివి ఆ పార్టీ భవిష్యత్తును పూర్తిగా కనుమరుగు చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. ఐదేళ్లపాటు టీడీపీని నడిపించిన నామా నాగేశ్వరరావు ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో మహాకూటమి బలపరిచిన టీడీపీ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గం నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్ చేతిలో ఓటమి చెందారు. దీంతో జిల్లాలో టీడీపీ పరిస్థితి తీవ్ర గందరగోళంగా ఉండటంతో పాటు గ్రామస్థాయిలో ప్రభావితం చేయగల నాయకులు కూడా లేకపోవడంతో నామా నాగేశ్వరరావు క్రమేణా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు2014 శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసినప్పటికీ కేవలం సత్తుపల్లి స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. అయితే అన్ని నియోజకవర్గాల్లోనూ బలమైన ఓటు బ్యాంకును కలిగి ఉంది. జిల్లాలో అభివృద్ధి పనుల కోసం టీఆర్‌ఎస్ అవసరం ఉందని భావించిన మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు దాదాపు 75 శాతం టీడీపీ కార్యకర్తలు, నాయకులతో 2014 శాసనసభ ఎన్నికల తరువాత టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. టీడీపీలో ఉన్నప్పుడు తుమ్మల, నామా వర్గాలుగా పనిచేసిన ఆ పార్టీ కార్యకర్తల్లో బలమైన వర్గంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వర్గం టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరిపోవడంతో మిగిలిన కొద్దిమంది నాయకులు, కార్యకర్తలతో నామా నాగేశ్వరరావు ఇన్నాళ్లూ పెద్దదిక్కుగా టీడీపీని నడిపించారు. జిల్లాలో జరిగిన వివిధ ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు. మారిన రాజకీయ సమీకరణల్లో అదే నామా నాగేశ్వరరావు ఇప్పుడు టీఆర్‌ఎస్ పార్టీలో చేరడటంతో ఎటుపోవాలో తెలియని పరిస్థితులలో మెచ్చా నాగేశ్వరరావు ఉన్నారు. ఆ నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు వర్గంగా, తెలుగుదేశం పార్టీ నాయకులుగా పనిచేస్తున్న పలువురు కీలక నేతలు సైతం నామా వెంట టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. నియోజకవర్గంలోని కార్యకర్తలు కూడా మెచ్చాపై ఒత్తిడి పెంచుతున్నారు. నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తప్పనిసరిగా టీఆర్‌ఎస్‌లో చేరాలని, జిల్లాలో కనుమరుగువుతున్న తెలుగుదేశంలో ఉండటం కంటే టీఆర్‌ఎస్‌లోనే చేరి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయడం మేలని మెచ్చాకి సూచిస్తున్నారు. కానీ సండ్రతోపాటే టీఆర్‌ఎస్‌లో చేరుతారని ప్రచారం జరిగిన తర్వాత వెనుకడుగు వేసిన మెచ్చా.. తిరిగి ఇప్డుపు మళ్ళీ టీఆర్‌ఎస్‌లో చేరడానికి నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తున్నారు. పైకి మేకపోతు గాంభీర్యంతో పార్టీ మారడం లేదని ప్రకటిస్తున్నా.. లోలోపల మాత్రం ఆలోచన మార్చుకొని త్వరలోనే ఆయన కూడా ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని సన్నిహితులు, తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఉన్న కొద్దిమందితో పార్టీని నడిపించాలని భావించిన చంద్రబాబు.. నామా వంటి నాయకులకు పార్టీలో కీలక పదవులను అప్పగించారు. అయినా తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోవడంతో ఆ పార్టీకి నాయకులెవరూ లభించే పరిస్థితి లేదు. దీంతో ఇప్పటికే జిల్లాలోని కీలక నాయకులంతా టీఆర్‌ఎస్ పార్టీలో చేరడంతో ఉన్న కొద్ది మంది కార్యకర్తలను కాపాడుకునే నాయకుడే లేకుండాపోయాడు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్న సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. సత్తుపల్లి ఎమ్మెల్యేగా సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు ఎన్నికైనప్పటికీ జిల్లాలో అభివృద్ధి పనులు విజయవంతంగా కొనసాగాలన్న ఆకాంక్షతో సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్ చేరేందుకు ముందే నిర్ణయించుకున్నారు. కార్యకర్తలు, నాయకుల అభీష్టం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే తగిలింది. దీనిని నుంచి తేరుకోకముందే ఇప్పుడు మరో ఎదురుదెబ్బ తగులుతోంది. నామా తెలుగుదేశం పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకోవడంతో ఇప్పటికే జిల్లాలో కొట్టుమిట్టులాడుతున్న తెలుగుదేశం పార్టీ ఉనికి గాలిలో కలిసిపోయింది. జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కుగా ఉన్న ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు తన పదవులకు రాజీనామా చేయడంతో మిగిలిన కొద్దిమంది నాయకులు కూడా ఆయన వెంటే పయనించేందుకు నిర్ణయించుకున్నారు. మరో వైపు అశ్వారావుపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు అంతర్మథనంలో పడ్డారు. ఉమ్మడి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు, కార్యకర్తలు సైతం టీఆర్‌ఎస్ పార్టీలో చేరనుండటంతో ఇప్పుడు తాను ఏమి చేయాలో తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారు. సత్తుపల్లి శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్య టీఆర్‌ఎస్‌లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నప్పుడే మెచ్చా నాగేశ్వరరావు కూడా చేరుతారనే ప్రచారం జరిగింది. అప్పుడు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు.. మెచ్చా నాగేశ్వరరావుతో చర్చించి తెలుగుదేశం పార్టీ నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటానని భరోసా కల్పించారు. 

Related Posts