YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్

నకిలీ ఓట్లలో గుంటూరు, తూర్పుగోదావరి టాప్

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీలో ఏఏ జిల్లాలో ఎన్ని నకిలీ ఓట్లు ఉన్నామో జాబితాను  ఏపీ ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.  రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు ఇటీవల దాఖలైన ఫామ్-7 దరఖాస్తుల్లో 85 శాతం నకిలీవేనని ఏపీ ఎన్నికల సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే..  ఓట్లను తొలగించాల్సిందిగా తమకు 9.5 లక్షల దరఖాస్తులు అందగా,వాటిలో కేవలం 1.41 దరఖాస్తులను మాత్రమే ఆమోదించి ఓట్లను తొలగించామని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా జిల్లాల వారీగా తొలగించిన ఓట్ల వివరాలను ఈసీ ప్రకటించింది.ఇందులో సగం నకిలీ ఓట్లు తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాలోనే ఉన్నాయి. శ్రీకాకుళం - 2,579, విజయనగరం- 5,166, విశాఖపట్నం- 2,407, పశ్చిమ గోదావరి- 8,669, ప్రకాశం- 6,040, నెల్లూరు- 3,850, కడప- 5,292, కర్నూలు- 7,684,  అనంతపురం- 6,516,  గుంటూరు- 35,063, తూర్పుగోదావరి- 24,190,  కృష్ణా- 19,774, చిత్తూరు- 14,052 నకిలీ ఓట్లు వున్నట్లు ఈసీ వెల్లడించింది.

Related Posts