YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

డీజీపీని కలిసన లక్ష్మి పార్వతి

డీజీపీని కలిసన లక్ష్మి పార్వతి

 యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డిని వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి సోమవారం కలిశారు. తనపై ఇటీవల చేసిన దృష్ప్రచారం పై డిజీపీ కి ఫిర్యాదు చేసారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసు కమిషనర్ ను ఆమె కలిసారు.  మాజీ ముఖ్యమంత్రి భార్య గా ఉన్న నన్ను నాప్రతిష్ఠ ను దెబ్బతీయలని కుట్రలు చేస్తున్నారు. కొన్ని మీడియా ఛానెల్స్ కావాలనే  తప్పుడు  ప్రచారం చేస్తున్నాయి. కోటి అనే వ్యక్తి నా కొడుకు లాంటి వాడు నాకు మందులు తీసుకొచ్చే వాడు. అలాంటి వాడు నాపై ఫిర్యాదు చేయడం ఏమిటో నాకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. డిజీపీ ని కలిశాను,డిజీపీ సీపీ కి ఫోన్ చేసి కేసు చూడమన్నాను. సీపీ ని కలిసి వివరాలు అన్ని చెప్పాను. వెంటనే స్పందించిన సీపీ అంజన్ కుమార్ సైబర్ క్రైమ్ పోలీసులను పిలిపించి వివరాలు తీసుకున్నారు. నా ఫోన్ ను పోలీసులకు అప్పగించానని ఆమె అన్నారు. అన్ని విధాలుగా దర్యాప్తు జరిపించి దోషిలను శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారని వెల్లడించారు.

Related Posts