YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఢిల్లీలో చంద్రబాబు ఏం చేసారు

ఢిల్లీలో చంద్రబాబు ఏం చేసారు
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఈవీఎంలు పై సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి ఏమి చేశారో చెప్పాలని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస రాజు డిమాండ్ చేసారు.  మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. వీ వీ పాడ్స్ ఈ ఎన్నికల్లో మొదటి సారిగా వినియోగించారు. సీఎం చంద్రబాబు నాయుడు తన ఓటమి నీ అంగీకరించకుండా ఈవీఎం లపై ఎన్నికల సంఘం పై రుద్దాలనే చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడు చౌక బారు నీచ రాజకీయలు చేస్తున్నారనీ అన్నారు. ప్రజా వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారనీ ఆరోపించడం సిగ్గు చేటని అన్నారు. ఏపీ లో కూడా తెలుగు దేశం పార్టి అధికారం కోల్పోతుంది. రాష్ట్రంలో పోలీసు సేల్స్ టాక్స్ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత సీఎం చంద్రబాబు కె దక్కింది. సీఎం చంద్రబాబు 150 సీట్లు వస్తాయని చెపుతుంటే టీడీపీ నేతలు 120 సీట్స్ వస్తాయని చెప్పడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. అసలు మీరు చెప్పే సీట్స్ టీడీపీ పార్టీకీ వస్తాయా ప్రతిపక్ష పార్టీలకు వస్తాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 46 వేల ఈ వీఎం లు ఎన్నికలకు ఉపయోగించారనీ ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారని తెలిపారు

Related Posts