YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

Highlights

  • నాయిని కృష్ణమూర్తి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
  • బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
  • నాయిని కృష్ణమూర్తి మాబడి, పాఠశాల మ్యాగజైన్లు నిర్వహించారు.
ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి బెంగళూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి

ఈ ఉదయం ప్రముఖ రచయిత నాయని కృష్ణమూర్తి మృతి చెందారు. ఆయన వయసు 67 సంవత్సరాలు, గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా ఆయన కన్నుమూశారు. చిత్తూరు జిల్లా చౌడేపల్లిలో ఆయన అంత్యక్రియలు రేపు జరుగుతాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 

కాగా కథలు, పలు నవలలు, ఆధ్యాత్మిక గ్రంథాలను రచించిన ఆయన మాబడి, పాఠశాల తదితర విద్యా సంబంధిత మ్యాగజైన్లను నిర్వహించారు.

ఆయన మృతిపై రచయితలు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

Related Posts