YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ పండుగపై నెట్ జన్ల సెటైర్లు

టీడీపీ పండుగపై నెట్ జన్ల సెటైర్లు
ఫలితాల ముందు టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏటా నిర్వహించే పసుపు పండుగ ‘మహానాడు’ రద్దు చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మదినోత్సవంలో భాగంగా మే 28 తేదీతో పాటు ఆ ముందు రోజు తరువాతి రోజున మొత్తం మూడు రోజుల పాటు ‘మహానాడు’ అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అయితే ఈసారి ‘మహానాడు’ లేకుండా ఎన్టీఆర్ జన్మదిన వేడుకలను ప్రతి చోట నిర్వహించనున్నారు. 
టీడీపీ అధికారంలో ఉన్న లేకున్నా.. ఈ ‘పసుపు పండుగ’ కోసం తెలుగు తమ్ముళ్లు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తారు. అయితే మే 23న ఎన్నికల ఫలితాలు ఉండటంతో ‘మహానాడు’ నిర్వహణ కష్టంతో కూడుకున్న పని కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలుగుదేశం పార్టీ పసుపు పండుగను రద్దు చేయడంపై కొంతమంది పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. పునరాలోచనలో పడింది టీడీపీ అధిష్టానం. మే 28 నుండి ‘మహానాడు’ నిర్ణయించేదానిపై కసరత్తులు చేస్తున్నారు. ఇక మహానాడు రద్దు వార్తలపై మూవీ క్రిటిక్, రాజకీయ విశ్లేషకుడు మహేష్ కత్తి సెటైర్ వేశాడు. ‘‘సెంద్రబాబు మే 28 న మహానాడు ఏర్పాట్లు వద్దంటున్నాడు అంటే... ఓటమి గ్యారంటీ అని అంగీకరించినట్టేనా?’’ అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక కత్తి మహేష్ కామెంట్స్‌పై కౌంటర్లు కూడా వస్తున్నాయి. ఎలాగూ 23న సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అందుకే ‘మహానాడు’ రద్దు చేశారేమో అంటూ తెలుగు తమ్ముళ్లు స్పందిస్తున్నారు 

Related Posts