YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కాంగ్రెస్ తో దోస్తీకి గులాబీ స్నేహహస్తం

 కాంగ్రెస్ తో దోస్తీకి గులాబీ స్నేహహస్తం
ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే పొలిటికల్ హీట్ తారా స్థాయికి చేరుతోంది. కేంద్రంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ, ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాయి. మరోవైపు ఈ రెండు పార్టీలూ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమితో నేషనల్ ఫ్రంట్‌ను అధికారంలోకి తెచ్చే దిశగా కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ అధికార ప్రతినిధి అబిద్ రసూల్ ఖాన్ ఆసక్తికర ప్రకటన చేశారు. ప్రధాని కుర్చీ ఫెడరల్ ఫ్రంట్‌‌కే దక్కాలని కేసీఆర్ కోరుకుంటున్నారని రసూల్ తెలిపారు. అవసరమైతే బయటి నుంచి కాంగ్రెస్ మద్దతు తీసుకోవాలనేది ఆయన ఆలోచనని టీఆర్ఎస్ నేత చెప్పారు. ప్రాంతీయ పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఆ పార్టీలకు చెందిన ఎవరో ఒకరికి ప్రధాని పీఠాన్ని కట్టబెట్టాలనేది కేసీఆర్ వ్యూహమని ఖాన్ తెలిపారు. కాంగ్రెస్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామన్న ఖాన్.. ప్రభుత్వ ఏర్పాటుకు వాళ్లు మద్దతిస్తారో లేదో చూడాలన్నారు. హస్తం పార్టీ ప్రధాని పీఠం కోరకుండా తమకు సపోర్ట్ చేస్తానంటే.. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాంతీయ పార్టీలు సిద్ధంగా ఉంటాయన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో కలవబోదని ఆయన చెప్పారు. బీజేపీతో విరక్తి చెందాం. ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం గానీ, ఆ పార్టీ మద్దతు తీసుకోవడం గానీ చేయం. కేసీఆర్‌తో చర్చలు జరుపుతున్న నేతలు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారని ఖాన్ చెప్పారు.సమాజ్‌వాదీ, బీఎస్పీ, వైఎస్ఆర్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలు లోక్ సభ ఎన్నికల్లో భారీగా సీట్లు గెలుస్తాయని కేసీఆర్ అంచనా వేస్తున్నారని ఖాన్ తెలిపారు. కాంగ్రెస్‌కు వంద సీట్లు దాటవని ఆయన చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్‌ 200 సీట్లలోపు గెలుపొందితే.. డీఎంకే లాంటి కాంగ్రెస్ మిత్రపక్షాలు ఫెడరల్ ఫ్రంట్‌లో చేరతాయని ఖాన్ తెలిపారు. కర్ణాటకలో జేడీఎస్ ఆధిక్యం సాధిస్తుంది. కమ్యూనిస్టులతోనూ చర్చలు జరుపుతున్నామని ఆయన తెలిపారు. 

Related Posts