YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

నీ జనాలు నీ వెంటే..ఇతరులను ఎందుకు పట్టించుకోవాలి ఏపి సిఎం చంద్రబాబును ప్రశ్నించిన కోన వెంకట్

నీ జనాలు నీ వెంటే..ఇతరులను ఎందుకు పట్టించుకోవాలి        ఏపి సిఎం చంద్రబాబును ప్రశ్నించిన  కోన వెంకట్
టాలీవుడ్ కు చెందిన వారిని సీఎం కేసీఆర్ బెదిరించి చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడించారని, వైసీపీకి వారిని మద్దతు తెలపాలని భయపెట్టారని అంటూ వచ్చిన ఆరోపణలపై ప్రముఖ మాటల రచయిత కోన వెంకట్ స్పందించారు. చంద్రబాబు వెంటే జనాలు ఉంటే కనుక ఇంకా ఆయన భయపడడమెందుకు? అని కోన వెంకట్ ప్రశ్నించారు.
ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘నీ జనాలు నీ (చంద్రబాబు) వెంటే ఉన్నప్పుడు, ‘పసుపు-కుంకుమ’ కాపాడుతున్నప్పుడు, బలమైన ఉద్యమంలా వచ్చి ఓట్లేసినప్పుడు వీళ్లందరిని అసలు ఎందుకు పట్టించుకోవాలి?’ అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ లో బర్నింగ్ టాపిక్ ఏదైనా ఉంటే అది ‘ప్రత్యేక హోదా’నే అని, కేసీఆర్, కేటీఆర్ ను అక్కడి ప్రజలు మర్చిపోయారని, కేసీఆర్ ను విలన్ గా ఏపీ ప్రజలు ఏమాత్రం చూడట్లేదని అభిప్రాయపడ్డారు.
సినిమా వాళ్లను కేసీఆర్ బెదిరిస్తున్నారు కనుకే వైఎస్ జగన్ కు వాళ్లు మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ‘కేసీఆర్ కు భయపడుతున్నామా? ఒకవేళ వాళ్లు భయపెడుతున్నారన్నది నిజమే అయితే కనుక, మేము భయపడుతున్నామన్నది కూడా నిజమే. అసలు కేసీఆర్ కు, ఆంధ్రా రాజకీయాలకు సంబంధం ఏమిటి?’ అని కోన ప్రశ్నించారు.కేసీఆర్ లేదా కేటీఆర్ బెదిరింపులతో తానో, మరొకరో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల టీడీపీకి పడాల్సిన ఓట్లన్నీ వైసీపీకి పడతాయా? ప్రజలను తాము ఏ రకంగా ప్రభావితం చేయగల్గుతామని అన్నారు. ప్రజలను అంతగా తాను ప్రభావితం చేయగలనని అనుకోవట్లేదని కోన వెంకట్ వ్యాఖ్యానించారు.
కేసీఆర్, కేటీఆర్ లకు చంద్రబాబు రూపంలో ఓ విలన్ దొరికాడన్నారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహాకూటమి తరపున చంద్రబాబు ప్రచారం చేసిన విషయాన్ని ప్రశ్నించగా కోన వెంకట్ స్పందిస్తూ, చంద్రబాబు రాకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇంకొన్ని ఎక్కువ సీట్లు వచ్చి ఉండేవని అన్నారు. ఎందుకంటే, ఒకడు హీరో కావాలంటే, వాడికి ఓ విలన్ కావాలని, ఆ విలన్ ఉన్నప్పుడే హీరోయిజం బయటపడుతుందని అన్నారు. కేసీఆర్ కు, కేటీఆర్ కు చంద్రబాబు రూపంలో ఓ విలన్ దొరికాడని, దీంతో, హీరో ఎలివేట్ అయ్యాడని అన్నారు.  

Related Posts