టిఆర్ ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రగతి భవన్ లో గురువారం మద్యాహ్నం 2గం జరుగుతుంది. ఈ నెల 17 నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో టిఆర్ ఎస్ ఎంపిలు అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఎంపిలతో చర్చిస్తారు. పార్లమెంటరీ పార్టీ సమావేశానికి హాజరుకావాల్సిందిగా లోకసభ సభ్యులను ఆహ్వానించారు.