YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బైక్ ను ఢీ కోన్న లారీ, నలుగురు దుర్మరణం

 బైక్ ను ఢీ కోన్న లారీ, నలుగురు దుర్మరణం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం నార్పల మండలం ముచ్చుకోట కనుమ దగ్గర బైక్‌ను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు చనిపోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుడ్ని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో బైక్‌ను ఢీకొట్టిన తర్వాత లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న ముగ్గురితో పాటూ లారీ క్లీనర్‌ కూడా చనిపోయాడు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లారీ బోల్తాపడటంతో.. కొద్దిసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు

Related Posts