YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన ప్రమాదం

మంత్రి పుష్పశ్రీవాణికి తప్పిన  ప్రమాదం

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఏపీ ఉపముఖ్యమంత్రి, గిరిజన శాఖమంత్రి పుష్పశ్రీవాణికి తృటిలో ప్రమాదం తప్పింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుష్పశ్రీవాణి తొలిసారిగా సొంత జిల్లా విజయనగరం విచ్చేయడంతో అభినందనలు తెలిపేందుకు పార్టీ శ్రేణులు భోగాపురం మండలం రాజాపులోవ సమీపంలో జాతీయరహదారి పక్కన సభావేదిక ఏర్పాటు చేశారు. వేదికపైకి ముందుగానే కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. మంత్రితోపాటు మరికొందరు నాయకులు సభావేదికపై వెళుతుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అప్రమత్తమైన మంత్రి వెంటనే కిందకు దిగడంతో ప్రమాదం తప్పింది. ఈఘటనలో ఎవరికీ ఎలాంటి  ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ పరిణామంతో వెంటనే మంత్రి తిరిగి విజయనగరం పయనమయ్యారు.  

Related Posts