YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీజేపీ ఆటలు సాగవు

బీజేపీ ఆటలు సాగవు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

గత వారం రోజులుగా బీజేపీ నేతలు భాద్యత లేకుండా మాట్లాడుతున్నారు. తాము అధికారం లోని రాష్ట్రాల్లో అధికారం లోకి రావాలని బీజేపీ నేతలు విచిత్ర విన్యాసాలు చేస్తున్నారని తెరాస ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. బుధవారం అయన తెరాస శాసనసభా పక్ష కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ లో జరిగే ప్రతి చిన్న విషయానికి బీజేపీ నేతలు మతం రంగు పులుముతున్నారు. నాలుగు ఎంపీ సీట్లు గెలవగానే బీజేపీ నేతలు వాపు ను చూసి బలం అనుకుంటున్నారు. ఏ ఎన్నికలు జరిగినా తెలంగాణ తెరాస వెంటే ఉంది. అసెంబ్లీ ,మండల ,జడ్పీ ఎన్నికల్లో బీజేపీ దారుణంగా ఓడింది. బీజేపీ ఎంపీ లు భాద్యతాయుతమైన పదవుల్లో ఉంటూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తూ అల్లర్లను ప్రేరేపిస్తున్నారు. ఆదిలాబాద్ లాంటి ప్రశాంతమైన జిల్లాలోనూ ఎంపీ సోయం బాపు రావు వర్గాల మద్య కొట్లాట పెడుతున్నారు. ఓ వర్గం తలలు నరుకుతామంటూ బాపు రావు చేసిన వ్యాఖ్యల ను ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బాపు
రావు తో క్షమాపణ చెప్పించాలి. బీజేపీ నేతల తాటాకు చప్పుళ్లకు ఎవరూ బెదిరేది లేదని అయన అన్నారు. తెలంగాణ లో మత రాజకీయాలకు స్థానం లేదు. .పశ్చిమబెంగాల్ లో చేసినట్టు తెలంగాణ లో చేస్తామంటే బీజేపీ కి కుదరదు. రాజాసింగ్,  బండి సంజయ్ లు హింస ను ప్రేరిపిస్తూ రాజకీయ లబ్ది కి ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ చైతన్య వంతమైన ప్రాంతం. బీజేపీ ఆటలు సాగవు. .బీజేపీ నేతలు ఎన్ని యాత్రలు చేసినా తెలంగాణ లో నిరాశ తప్పదని అన్నారు. బాద్యతాయుతమైన పదవుల్లో ఉన్న బీజేపీ నేతలు అబద్దాలు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తే వారి కలలు కలలుగానే ఉంటాయని అయన అన్నారు.

Related Posts