YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ప్రజా సేవకు పదవీ విరమణ లేదు - శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

ప్రజా సేవకు పదవీ విరమణ లేదు - శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:

ప్రత్యక్ష పరోక్ష ఎన్నికల ద్వారా సంక్రమించిన పదవులకు,అధికార అనధికార ఉద్యోగ బాధ్యతలు కు పదవి విరమణ ఉంటుంది తప్ప రాజకీయాలకు, ప్రజా సేవకు పదవీ విరమణ లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఎంపీడీవో  లక్ష్మి  పర్యవేక్షణలో ఎంపీపీ రెడ్డి అనంత కుమారి అధ్యక్షతన జరగ్గా ముఖ్యఅతిథిగా శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలో జరిగిన  వివిధ అభివృద్ధి పథకాలపై చర్చించారు. అనంతరం    అయిదేళ్ల పదవీ కాలం పూర్తి చేసుకున్న మండల పరిషత్  అధ్యక్షురాలు ఎంపీపీ రెడ్డి అనంత కుమారి, పాలకవర్గ  సభ్యులను, జడ్పిటిసి ధర్నాల రామకృష్ణ  ను, సహకరించిన అధికారులను రెడ్డి సుబ్రమణ్యం చేతులమీదుగా  ఘనంగా దుశ్శాలువా, పూలమాలలతో సన్మానించి అభినందించారు . ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

Related Posts