యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
వనపర్తి జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి పూజ ఎలక్ట్రానిక్స్ వరకు చేపట్టిన డ్రైనేజీ నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగడం పట్ల ఒకపక్క ప్రజలు. వర్తకులు మరోపక్క వాహనాల వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఈ పనులు వేగవంతంగా కొనసాగక పోవడంతో ప్రతి ఒక్కరు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రాజీవ్ చౌక్ ప్రాంతంలో మందుల దుకాణాలు. హోటల్లు. వివిధ రకాల షాపులో ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ ఈ ప్రాంతం లోకి వచ్చి వారికి అవసరమైన మందులను వివిధ రకాల వస్తువులను కొనుగోలు చేసుకొని వెళుతుంటారు. ఈ నేపథ్యంలో డ్రైనేజీ నిర్మాణం పనులు కొనసాగుతుండడం వల్ల షాపుల ముందు భారీ స్థాయిలో గుంతలు తీయడం వల్ల షాపులోకి ఎలా వెళ్లాలంటూ జంకుతున్నారు. షాపుల యజమానులు రోడ్డు నుంచి షాపులోకి కర్రలతో మెట్లు వంటివి ఏర్పాటు చేసినా కూడా వాటిపై ఎలా ఎక్కాలి ఎలా కొనాలంటూ వారు జంకుతున్నారు.