అమరావతి లో ఉండవల్లి స్థానిక నివాసం వద్ద పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు మోపిదేవి వెంకటరమణ ను మంగళవారం రాష్ట్ర నాయకులు గోపాల మిత్రులు కలిసి తమ సమస్యలు గురించి తెలియ జేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం ఇవ్వాలని, సెల్ఫ్ ఎంప్లయిమెంట్ అను పదం తీసివేయాలి కోరారు. మంత్రి మోపిదేవి వెంకటరమణ గోపాల మిత్రులు సమస్యలు విని సానుకూలంగా స్పందించి బుదవారం మంత్రి కార్యాలయం ఆఫీసు లో కలవాలని మిత్రులకు సూచించారు. నాగ వేణి, వెంకటేశులు, రాము,నాగేంద్ర,శివ, రంగన్న తదితర గోపాల మిత్రులు మంత్రిని కలుసుకున్నారు.