YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోట్లు ఖర్చు పెట్టారు : బీజేపీ

 కోట్లు ఖర్చు పెట్టారు : బీజేపీ

ప్రజావేదిక కూల్చివేత నిర్ణయం జగన్ సర్కారు దూకుడుకు సిసలైన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. కలెక్టర్ల సమావేశం నిర్వహించిన మరుసటిరోజే ప్రజావేదిక కూల్చివేత ప్రారంభమైంది. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రజావేదిక కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మితమైందని, అందుకే దాన్ని కూల్చివేయడం కంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలకు ఉపయోగించడం మంచిది అని అభిప్రాయపడ్డారు. గత టీడీపీ సర్కారు వ్యవస్థలను దుర్వినియోగం చేసిందనడానికి ప్రజావేదిక నిర్మాణం ఓ ఉదాహరణ అని, ప్రజాధనంతోనే ప్రజావేదిక నిర్మించారని ఆరోపించారు. అయితే, ప్రజాధనం దుర్వినియోగం కావడాన్ని తాను అంగీకరించలేనని కన్నా స్పష్టం చేశారు.

Related Posts