YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ మీటింగ్ కు గంటా, నాని డుమ్మా

టీడీపీ మీటింగ్ కు గంటా, నాని డుమ్మా

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

విజయవాడలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశానికి ఆ పార్టీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గంటా డుమ్మా కొట్టారు. చంద్రబాబు తీరుపై ఈ ఇద్దరు నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. పీఏసీ చైర్మన్ పదవి తనకు దక్కకపోవడంతో గంటా అలకబూనారని, కృష్ణా జిల్లా రాజకీయాల్లో చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు కేశినేనికి నచ్చడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వారిద్దరూ ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది.

Related Posts