ఆటో బోల్తా…మహిళ మృతి
వనపర్తి సెప్టెంబర్ 11,
వనపర్తి పట్టణం గాంధీ నగర్ కు చెందిన కూలీలు పొట్టకూటి కోసం పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామానికి వరినాట్లు వేసేందుకు ఆటోలో వెళ్తుండగా పెబ్బేరు పీజేపీ క్యాంపు ఆఫీస్ సమీపంలో కుక్క
అడ్డంగా రావడంతో అదుపు తప్పి ఆటో బోల్తా పడింది ఈ ప్రమాదం లో ఆటో డ్రైవర్ తో పాటు మరో ఆరు మంది కూలీలకు తీవ్ర గాయాలుగాయాలు కాగా కురువమ్మ అనే మహిళ పరిస్థితి విషమించడం తో ఆస్పత్రి కి తరలిస్తుండగా మృతి చెందింది.గాయపడ్డ వారిని వనపర్తి ఏరియా ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.