YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సమస్యలపై కలిసి పోరాటానికి సై

Highlights

  • భవిష్యత్ కార్యాచరణ పై చర్చ 
  • 19 న రౌండ్ టేబుల్ మీటింగ్ 
  •  పవన్ కళ్యాణ్ తో  సి.పి.ఎం మధు బేటీ 
సమస్యలపై కలిసి పోరాటానికి సై

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్రత్యేక హోదాతో సహా అన్ని సమస్యలపై కలిసి పోరాటం చేద్దామని జనసేనాని అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. గురువారం పవన్ కళ్యాణ్ విజయవాడలో సిపిఎం , సిపిఐ పార్టీల రాష్ట్ర కార్యదర్సులు మధు, రామకృష్ణలతో వేర్వేరుగా సమావేశమయ్యారు.ఈ సందార్ధంగా మధు మీడియా తో మాట్లాడుతూ..  వామపక్ష పార్టీలు కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆహ్వానం మేరకు మేము ఆయన్ని జనసేన పార్టీ ఆఫీస్ లో కలిసామని చెప్పారు.ఇదొక  మర్యాదపూర్వకంగా కలసిన సమావేశమన్నారు. భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించామన్నారు.వెనుకబడిన జిల్లాల కోసం పని చేయాలని ఆయన కోరినట్టు తెలిపారు ఎన్నికల కోసం కాదు . ప్రజా సమస్యలు పరిస్కారం కోసం మాత్రమే ఈ  భేటీ అని స్పష్టం చేశారు. అయన ఆలోచన విధానాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర సమస్యలపై మరోసారి పవన్ తో సమావేశంకానున్నట్టు చెప్పారు. ముఖ్యంగా  విభజన చట్టంలో ఉన్న హామీల పై కలిసి పోరాడాలని ఆయన ప్రతిపాదించారన్నారు. అందుకు తాము  అంగీకరించామన్నారు.ఇందులో భాగంగా ఈ నెల  19 న రౌండ్ టేబుల్ మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నాం అక్కడ కొన్ని నిర్ణయాలు తీసుకుంటామని మధు వెల్లడించారు.

Related Posts