YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబు కు జిరాక్స్ పవన్ కళ్యాణ్

 చంద్రబాబు కు జిరాక్స్ పవన్ కళ్యాణ్

 చంద్రబాబు కు జిరాక్స్ పవన్ కళ్యాణ్
విజయవాడ నవంబర్ 16
జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక మత పరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. జగన్  ప్రవేశపెట్టిన పథకాలు దేశానికి ఆదర్శంగా ఉన్నాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  అన్నారు. శనివారం అయన ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బ్రిటీష్ వారి వాలే చంద్రబాబు విభజించు పాలించు విధానాన్ని అమలు చేస్తున్నారు. చంద్రబాబు దీక్షకు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి మద్దతు లేదు. చంద్రబాబు దీక్షకు 15 మంది ఎమ్మెల్యేలు హాజరు కాలేదని అన్నారు. జగన్మోహన్ రెడ్డిపై మత పరమైన విమర్శలు చేయడం ద్వారా బీజేపీకి దగ్గరకు కావాలని ప్రయత్నం చేస్తున్నారు. తిరుమల, శ్రీశైలం, అన్నవరం లో అన్యమత ప్రచారమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అన్యమత ప్రచారం జరగలేదని మేము చర్చకు సిద్ధమా.. మాతో చర్చకు టీడీపీ నేతలు సిద్దమా అని సవాల్ విసిరారు. తిరుపతి కొండపై సోలార్ ఫ్యానల్ ను పట్టుకొని సిలువ అంటూ  ప్రచారం చేస్తున్నారు. భవాని ఐలాండ్ లో చంద్రబాబు హయాంలో పెట్టిన బొమ్మలను పట్టుకొని తెలుగు తల్లికి అన్యాయం జరిగిందని కన్నా లక్ష్మీనారాయణ అసత్య ప్రచారం చేస్తున్నారు. అన్నవరంలో అన్యమత ప్రచారం అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. టీడీపీ హయాంలో బస్ టికెట్స్ పై ముద్రించిన టికెట్స్ పట్టుకొని తిరుపతి లో అన్యమత ప్రచారమని టీడీపీ నేతలు బురద జల్లుతున్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేయడం దుర్మార్గమని విమర్శించారు.  చంద్రబాబు హయాంలో 40 దేవాలయాలను చంద్రబాబు కూలదొయించాడు. చంద్రబాబు దేవాలయాలను కూలదొయించినప్పుడు కామినేని,  మాణిక్యాలరావు ఎక్కడ ఉన్నారు.  చంద్రబాబు కూలదొయించిన దేవాలయాలను జగన్ మోహన్ రెడ్డి నిర్మిస్తున్నారు.  అన్యమత ప్రచారమని అసత్యప్రచారం చేస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ చంద్రబాబు జీవితమంతా కుట్రలు కుతంత్రాలు. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న మంచి కార్యక్రమాలు చూసి చంద్రబాబు ఓర్వలేక అన్యమత ప్రచారాలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.  అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే 85 శాతం హామీలను జగన్ మోహన్ రెడ్డి అమలు చేశారు. దేశంలో ఏ నాయకుడు చేయనన్ని అభివృద్ధి కార్యక్రమాలు జగన్  ప్రవేశ పెట్టారు. జగన్మోహన్ పెట్టిన అభివృద్ధి కార్యక్రమాల నుంచి ప్రజల దృష్టి మార్చేందుకు చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మురళీ మోహన్ వెంకన్న స్వామిని వెంకన్న చౌదరి చేశారు. దుర్గమ్మ, గుడిలో క్షుద్రపూజలు జరిగింది చంద్రబాబు హయాంలో జరిగింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రచార పిచ్చితో పుస్కరాల్లో 29 మంది చనిపోలేదా. శ్రీశైలం దేవాలయంలో అర్ధరాత్రి తాంత్రిక పూజాలు జరిగింది చంద్రబాబు పాలనలో కాదా..
అర్చకలకు వంశపారంపర్య అర్చికత్వం కల్పించింది జగన్. పవన్ కళ్యాణ్ అన్యమత ప్రచారమంటూ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. చంద్రబాబు కు జిరాక్స్ పవన్ కళ్యాణ్. చంద్రబాబు దేవాలయాలను కులదోస్తే జగన్మోహన్ రెడ్డి వాటిని నిర్మిస్తున్నారు. కాంట్రాక్టు పనిలో 150 కోట్లు లంచం తీసుకున్న నేత ఎవరో టీడీపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు. హద్దు మీరు తప్పుడు ప్రచారం చేస్తే క్రిమినల్ కేసులు తప్పవు. బీజేపీ అధ్యక్షుడు కన్నా వైస్సార్సీపీపై తప్పుడు ట్వీట్ చేస్తున్నారని ఆరోపించారు. 

Related Posts