గోవా డీజీపీ మృతి
పనాజీ నవంబర్ 16,
గోవా డిజిపి ప్రణబ్ నందా శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారు. 1988 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన 57 ఏళ్ల ప్రణబ్ నందా అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, ఇతర కేంద్ర పాలిత ప్రాంతాల క్యాడర్కు చెందినవారని గోవా ఐజి జస్పాల్ సింగ్ వెల్లడించారు. అధికారిక పని మీద ఢిల్లీకి వెళ్లిన ప్రణబ్ నందా గుండెపోటు రావడంతో అక్కడ మరణించారు. ప్రణబ్ నందా భార్య సుందరి కూడా పుదుచ్చేరి డిజిపిగా పనిచేశారు. రెండేళ్ల పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోలో పనిచేసిన నందాను ఈ ఏడాది మేలో గోవా డిజిపిగా నియమించారు.