YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీజేపీతో ఎంపీలు టచ్ లో ఉన్నారు : సోము

బీజేపీతో ఎంపీలు టచ్ లో ఉన్నారు : సోము

బీజేపీతో ఎంపీలు టచ్ లో ఉన్నారు : సోము
రాజమండ్రి,  నవంబర్ 21 
ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు వైఎస్సార్‌సీపీ ఎంపీలు బీజేపీ అధిష్టానంతో టచ్‌లో ఉన్నారని బాంబ్ పేల్చారు. ఎంత మంది ఎంపీలు తమ పార్టీలోకి వస్తారన్నది తాను ఇప్పుడే చెప్పలేనన్నారు. అవినీతి అక్రమాల కేసులు ఉన్నవారిని మేం తీసుకొకూడదంటే ఎలా అని ప్రశ్నించిన ఆయన.. రాష్ట్రంలో తాము బలపడాలనుకుంటున్నామని.. తాము పరిపాలన చేయాలనుకుంటున్నామని చెప్పారు. ఏపీలో కూడా బీజేపీ బలోపేతం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.విధానాల్లో జగన్‌కు చంద్రబాబుకు పెద్ద తేడా లేదన్నారు వీర్రాజు. ఇద్దరూ ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారని. క్రిస్టియన్, ఇస్లాం మాత్రమే మతాలు.. హిందూ మతం కాదు ధర్మం, జీవన విధానం అన్నారు. బీజేపీ మత ఓటు బ్యాంకు రాజకీయాలకు వ్యతిరేకం అన్నారు. పాస్టర్లకు ఇమామ్‌లకు జీతాలు ఇస్తామని చంద్రబాబు, జగన్ ఇద్దరూ అన్నారని గుర్తు చేశారు.ఇక ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంపైనా వీర్రాజు స్పందించారు. తెలుగును తీసేస్తామనే హక్కు ఎవరికీ లేదని.. ఇంగ్లీషు మీడియం అమలుపై తల్లిదండ్రుల అభిప్రాయం తీసుకోవాలన్నారు. ఇక తిరుమల ఆలయంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు హుందాగా లేవని.. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి బాధ్యాతయుతంగా వ్యవహరించాలన్నారు. ఇక ఇంగ్లీష్ మీడియం విషయంలో కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలపై తాను స్పందించనని.. ఆయన్నే వివరణ అడిగితే మంచిదన్నారు.

Related Posts