YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అసెంబ్లీకి దూరంగా టీడీపీ

 అసెంబ్లీకి దూరంగా టీడీపీ

 అసెంబ్లీకి దూరంగా టీడీపీ
విజయవాడ, జనవరి 23
అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం అసెంబ్లీకి హాజరుకాకూడదని చంద్రబాబు నిర్ణయించారు. శాసనమండలిలో జరిగిన పరిణామాలపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. నిరసనగా సభా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది.. అసెంబ్లీని ఎమ్మెల్యేలు బహిష్కరించారుమరోవైపు ఇవాళ టీడీఎల్పీ సమావేశం జరగనుంది. అసెంబ్లీతో పాటూ మండలిలో తమ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై దౌర్జన్యం జరిగిందని ఆరోపిస్తున్న టీడీపీ.. తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలతో చర్చించి దిశా నిర్దేశం చేయనున్నారు.టీడీపీ బుధవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. సభలో తమ ఎమ్మెల్యేల్ని బెదిరిస్తున్నారని.. స్పీకర్ కూడా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించింది. ముఖ్యమంత్రి కూడా స్పీకర్‌కు ఆదేశాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు.

Related Posts