YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రజాస్వామ్య ర్యాంకింగ్ లో భారత్ పూర్ 

ప్రజాస్వామ్య ర్యాంకింగ్ లో భారత్ పూర్ 

ప్రజాస్వామ్య ర్యాంకింగ్ లో భారత్ పూర్ 
ముంబై, జనవరి 23
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారత్.. దానిని ఆచరించడంలో మాత్రం దిగువనే ఉంది. ప్రజాస్వామ్య సూచీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్ స్థానం మరింత దిగజారినట్టు ది ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వేలో వెల్లడయ్యింది. 2018తో పోల్చితే 2019లో పది స్థానాలను కోల్పోయింది. భారత్‌లో క్రమేణా పౌరహక్కులను అణచి వేయడమే ఇందుకు ప్రధాన కారణమని సర్వేలో పేర్కొంది. ప్రజాస్వామ్య సూచీ 2019 ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత్‌ 6.90 పాయింట్లతో 51వ స్థానంలో నిలిచింది. అదే 2018లో 7.23 స్కోరు సాధించడం విశేషం. మొత్తం 165 దేశాలు, రెండు ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించారు.ఎన్నికల ప్రక్రియ, బహుళత్వం, ప్రభుత్వ పనితీరు, రాజకీయ పార్టీల భాగస్వామ్యం, రాజకీయ సంస్కృతి, పౌర హక్కులు అనే ఐదు అంశాలను ఆధారంగా మార్కులను కేటాయించారు. ఎనిమిది కన్నా ఎక్కువ పాయింట్లు వస్తే ‘సంపూర్ణ ప్రజాస్వామ్యం’, 8-6ల మధ్య ఉంటే ‘బలహీన ప్రజాస్వామ్యం’, 6-4 మధ్య ఉంటే ‘హైబ్రిడ్‌ పరిపాలన’, 4 కన్నా తక్కువ ఉంటే ‘నియంతృత్వం’ అన్న వర్గీకరించారు.ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ సర్వేలో భారతదేశం బలహీన ప్రజాస్వామ్యం అన్న వర్గంలో చేరింది. అంతేకాదు, 2006 తర్వాత భారత్ ఇంతటి తక్కువ స్కోర్ సాధించడం ఇదే తొలిసారి. బ్రెజిల్‌ కన్నా కేవలం ఒక్క స్థానం ముందుండడం గమనార్హం. 6.86 స్కోరుతో ఆ దేశం 52వ స్థానంలో ఉంది.ఇదే సర్వేలో చైనా 2.26 స్కోర్ (153వ ర్యాంకు), పాకిస్థాన్‌ 4.25 (108వ ర్యాంకు), శ్రీలంక 6.27(69వ స్థానం), బంగ్లాదేశ్‌ 5.88 (80వ స్థానం), రష్యా 3.11 స్కోర్‌ (134వ స్థానం) సాధించాయి. ఈ సర్వేలో దక్షిణ కొరియా చిట్టచివరి స్థానంలో నిలిచింది. తొలి పది స్థానాల్లో... నార్వే (1), ఐస్‌లాండ్‌ (2), స్వీడన్‌ (3), న్యూజిలాండ్‌ (4), ఫిన్‌లాండ్‌ (5), ఐర్లాండ్‌ (6), డెన్మార్క్‌ (7), కెనడా (8), ఆస్ట్రేలియా (9), స్విట్జర్లాండ్‌ (10) ఉన్నాయి.అంతకుముందు ఏడాదితో పోల్చితే ప్రజాస్వామ్య సూచీలో ప్రపంచ సగటు సైతం పడిపోయింది. ఇది 2018లో 5.48 పాయింట్ల స్కోర్ సాధించగా, 2019లో 5.44 పాయింట్లు సాధించింది. లాటిన్ అమెరికా, సబ్- సహారా ఆఫ్రికాల్లో గణనీయంగా పడిపోగా, మధ్య, ఉత్తర ఆసియాలో అత్యల్ప స్కోర్లు నమోదయ్యాయి.భారత్ విషయానికి వస్తే ఎన్నికల ప్రక్రియ, బహుళత్వంలో 6.67 స్కోర్, ప్రభుత్వ పనితీరుకు 6.79 స్కోర్, రాజకీయ భాగస్వామ్యానికి 6.67 పాయింట్లు, రాజకీయ సంస్కృతికి 5.63 పాయింట్లు, పౌర హక్కులకు 6.76 పాయింట్ల లభించాయి. ఆసియా, ఆస్ట్రేలియా ప్రాంతాల్లో భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.

Related Posts