మండలి ఛైర్మన్ షరీఫ్ చిత్ర పటానికి పాలాభిషేకం
అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడాన్ని హర్షిస్తూ గుంటూరులో అమరావతి జేఏసీ సంబరాలు చేసుకుంది. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మండలి ఛైర్మన్ షరీఫ్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ శాసన మండలిలో ఛైర్మన్ షరీఫ్... వైసీపీ ప్రభుత్వం ఎన్నికుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందంటూ ఫైర్ అయిన జేఏసీ నాయకులు... రాజధాని కట్టేందుకు డబ్బులు లేవంటున్న ప్రభుత్వం, కేసులు వాదించేందుకు రూ.కోట్లను లాయర్లకు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ప్రజల అభీష్టం మేరకే రాజధాని నిర్మాణం జరగాలని డిమాండ్ చేశారు.