YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

 కారులో 3 మృతదేహాలు

 కారులో 3 మృతదేహాలు

 కారులో 3 మృతదేహాలు
భువనగిరి ఫిబ్రవరి 22
యాదాద్రి భువనగిరి జిల్లా సర్నేనిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కారు ప్రమాదంలో గ్రామ సర్పంచి భర్త, కుమారుడు, డ్రైవర్ మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే... సర్నేనిగూడెం గ్రామ సర్పంచి రాణి భర్త మధు, కుమారుడు మత్య్సగిరి, డ్రైవర్ సాగుబావిగూడెంనకు చెందిన శ్రీధర్రెడ్డి సమీప గ్రామానికి కారులో వెళ్లి వస్తుండగా... శుక్రవారం రాత్రి ఎల్లంకి చెరువు కట్టపై వారు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లడంతో ముగ్గరూ అందులోనే ఇరుక్కుపోయారు. ఎంతకూ వీరు ఇంటికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు నిన్న రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రాత్రి నుంచి వీరి కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చేపట్టారు. విచారణలో భాగంగా పోలీసులు ఎల్లంకి గ్రామంలోని సీసీ కెమెరాలో నమోదైన దశ్యాలను పరిశీలించి.. కారు చెరువు కట్టపైకి వెళ్లినట్టు గర్తించారు. ఇవాళ మధ్యాహ్నం ఎల్లంకి చెరువులోంచి కారుతో సహా 3 మృతదేహాలను బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

Related Posts