YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం

ఛత్తీస్ ఘడ్ లో ప్రహర్ ఆపరేషన్

ఛత్తీస్ ఘడ్ లో ప్రహర్ ఆపరేషన్

ఛత్తీస్ ఘడ్ లో ప్రహర్ ఆపరేషన్
రాయ్ పూర్, ఫిబ్రవరి 24
చత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మావోలు హతమయ్యారు. బడేకదేవాల్ అటవీ ప్రాంతంలో దాదాపు 30 గంటల పాటు ఎదురుకాల్పులు సాగాయి. చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఏరివేతకు ఆపరేషన్ ప్రహార్‌ను పోలీసులు ప్రారంభించారు. తొండామార్కా, దుర్మా, కసాల్‌పాడ్, పలోడి టెక్రీలో మూడు రోజుల నుంచి కూంబింగ్ నిర్వహించారు. నక్సల్స్ తప్పించుకునే వీల్లేకుండా మొత్తం 1,400 మంది పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. తొండమార్కా, దుర్మాల వద్ద పెద్ద సంఖ్యలో మావోయిస్టుల ఉన్నారనే సమాచారం అందడంతో డీఆర్‌జీ, ఎస్టీఎఫ్, కోబ్రో బెటాలియన్లు సంయుక్తంగా వారి స్థావరాలపై దాడిచేశాయి.ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 8 మంది మావోయిస్టులు మృతిచెందారు. మరో 12 మంది నక్సల్స్ గాయపడ్డారు. అయితే, పోలీసులకు మాత్రం ఒక్క మృతదేహమే లభ్యమైంది. ఆరుగురు నక్సలైట్లకు వారి అనుచరులు అంత్యక్రియలు నిర్వహించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నక్సల్స్ స్థావరాల వద్ద భారీ ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.బస్తర్ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు గత కొన్నేళ్లుగా తగ్గుముఖం పట్టడంతో భద్రతా దళాలకు ఉపశమనం లభించింది. అయితే, తాజాగా మావోయిస్టులు తమ ఉనికి చాటుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లను మావోలు వినియోగించడం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 19న సుక్మా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో  పాల్గొన్న మావోయిస్టులు హెల్మెట్‌లు, బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించడంపై పోలీసులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.నక్సలైట్టు బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్లు ధరించి ఎదురు కాల్పుల్లో పాల్గొవడం ఇదే తొలిసారి. ఈ జాకెట్లు వారికి ఎక్కడ నుంచి వచ్చాయనే అంశం మిస్టరీగా మారింది. పోలీస్ స్టేషన్లపై దాడులకు పాల్పడి వీటిని ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. మంగళవారం కిస్టారం అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ సీఆర్పీఎఫ్ కమాండో మృతిచెందాడు. మరో జవాన్ గాయపడ్డాడు.

Related Posts