మాజీ ఎమ్మెల్యే బండారు అందోళన
విశాఖపట్నం ఫిబ్రవరి 24
విశాఖ జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెం వద్ద గ్రావెల్ క్వారీల వద్ద మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారా యణ మూర్తి కార్యకర్తలతో ఆందోళన చేశారు.గత మూడు నెలలుగా ఇళ్ల స్థలాల చదును పేరుతో కొండలను వైసిపి నాయకులు ప్రోత్సాహంతో గ్రావెల్ నిర్వాహకులు కొండలను పిండి చేసి లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారు. క్వారీలకు సమీపంలో నివాస స్థలాలు ఉండడంతో ఆ కుటుంబాలకు కంటి మీద కునుకు లేకుండా పోతుంది అని గ్రామస్తులు వాపోయారు. గ్రావెల్ దందా చేస్తున్నా వారికి అధికారుల అండదండలు ఎక్కువవడంతో చెలరేగిపోతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు, మైనింగ్ అధికారుల ఫోన్ చేసిన పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎన్టీపీనీ సంస్థ సీఎస్సార్ నిధులతో పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన గ్రీన్ పార్క్ ను గ్రావెల్ కోసం మొక్కలను తొలగించారన్నారు.వారం రోజుల వ్యవధిలో ఈ అనధికార క్వారీల నిలుపుదల చేసి వారిపై కేసులు పెట్టి అక్రమార్జన చేసిన లక్షలాది రూపాయలు పెనల్టీగా వసూలు చేయ కపోతే నిరసన తెలిపి అనంతరం టీడీపీ ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని మైనింగ్ అధికారులను డిమాండ్ చేశారు.