టోల్ ప్లాజా దగ్గర ఎమ్మెల్నీ భైఠాయింపు
యాదాద్రి ఫిబ్రవరి 24
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ఫ్లాజా సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాహనాన్ని అడ్డుకున్నారు. టోల్ ఫీజ్ చెల్లించి వెళ్లాలని చెప్పడంతో వివాదం చెలరేగింది. నర్సిరెడ్డి తాను ఎమ్మెల్సీనని చెప్పి.. ఐడి కార్డు చూపించినా సిబ్బంది అనుమతించకపోవడంతో అయన నిరసనకు దిగారు. మొదట గన్ మెన్ లేకపోవడం తో ఎమ్మెల్సీ అనుకోలేదని సిబ్బంది చెబుతున్నారు. తర్వాత టోల్ మినహాయింపు జాబితా లో ఎమ్మెల్సీ పేరు లేదంటూ చెప్పారు. ఈ సమాచారం తెలిసిని ఉన్నతాధికారులు నర్సిరెడ్డిని అనుమతించాలని ఆదేశించారు. అసలు ఏ ఎమ్మెల్సీ ని ఆపకుండా తనను మాత్రమే ఎందుకు ఆపారో సమాధానం చెప్పాలంటూ.. సిబ్బంది తీరుకు నిరసనగా నర్సిరెడ్డి టోల్ ఫ్లాజా వద్ద బైఠాయించారు.