రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి
అదిలాబాద్ ఫిబ్రవరి 24
ఇంద్రవెల్లిలో సోమవారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల చెందిన ఏమోలొలు లక్ష్మి ,అంజిలు ప్రమాద స్థలంలోనే మృతి.సంఘటన స్థానానికి ఇంద్రవెల్లి ఎస్సై అరికెల గంగారాం చేరుకుని శవాలను ఉట్నూరు ఆసుపత్రికి తరలించారు. దంపతులిద్దరూ ఆదిలాబాద్ లోని దుర్గానర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. నిత్యం లూనా పై వెళ్తూ వంట పాత్రలను అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఉదయం ఆదిలాబాద్ నుండి ఉట్నూర్ వైపు వెళుతుండగా ఇంద్రవెల్లి పెట్రోల్ పంప్ సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ప్రమాద స్థలంలోనే ఇద్దరు మృతి చెందారు.