రాసిచ్చిన స్క్రిప్టులు చదవటం కంటే రాజీనామా చేసి టిడిపిలో చేరండి
కమ్యూనిస్టులకు మంటగలుస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి సలహా
అమరావతి ఫిబ్రవరి 24
కమ్యూనిష్టు పార్టీలంటే ఒకప్పుడు గౌరవం వుండేది. నారాయణ, రామకృష్ణ లాంటి వ్యక్తులు వచ్చాక ఆ పార్టీల గౌరవం మంటగలుస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నారాయణ, రామకృష్ణ లకు తెలుగుదేశం పార్టీనుంచి డబ్బులు అందుతున్నాయని ఆయన అన్నారు.చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టులు చదవటం కంటే కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం లో చేరండని ఆయన సలహా ఇచ్చారు. ప్రతిరోజు రామకృష్ణ లోకేష్ బండి ఎక్కుతారని, డబ్బులు తీసుకోంటారని తెలుగుదేశమే ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. కమ్యూనిష్టు పార్టీ నాయకులు క్యారెక్టర్లు చంపుకున్నారని, ప్రజల గురింంచి పోరాడటం మానేశారని ఆయన అన్నారు.విశాఖలో రాజధాని వద్దని నేవిపైన ఆరోపించారు, గంటల్లోనే నేవివారు తిట్టారని ఆయన అన్నారు. కియా పోతుందన్నారు వెధవలు, ఇది సిగ్గుమాలిన చర్య కాదా? అని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రామకృష్ణ లాంటి బఫూన్లను మైనార్టీలు నమ్మకండి అని ఆయన